ముంబై-అహ్మదాబాద్ మధ్య భారత తొలి బుల్లెట్ రైలు డిజైన్ విడుదల

ముంబై – అహ్మదాబాద్ మధ్య నడవనున్న భారతదేశపు తొలి బుల్లెట్ రైలు అధికారిక నమూనా రూపకల్పనను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఢిల్లీలో విడుదల చేసింది. విమానాన్ని పోలి ఉండే ఆధునిక డిజైన్తో రూపొందించిన ఈ రైలు సోషల్ మీడియాలో విశేష చర్చకు దారితీసింది.
సుమారు 508 కిలోమీటర్ల పొడవైన ఈ హైస్పీడ్ రైలు మార్గం మహారాష్ట్ర, గుజరాత్ మరియు దాద్రా నగర్ హవేలీ ప్రాంతాలను కలుపుతుంది. ముంబై, సూరత్, వడోదరా, అహ్మదాబాద్ సహా మొత్తం 12 స్టేషన్లు ఈ మార్గంలో ఏర్పాటు కానున్నాయి.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన 1389.5 హెక్టార్ల భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్లోని 8 స్టేషన్ల మౌలిక వసతుల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అలాగే కన్సోలి – షిల్ఫాటా మధ్య 4.8 కిలోమీటర్ల సముద్రగర్భ సొరంగ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
అదనంగా, 17 నదీ వంతెనల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జపాన్ శింకాన్సెన్ సాంకేతికత ఆధారంగా రూపొందుతున్న ఈ బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
